byసూర్య | Thu, Oct 15, 2020, 02:43 PM
ముషీరాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలను స్థానిక శాసనసభ్యులు ముఠా గోపాల్ తో కలిసి మంత్రి కేటీఆర్ పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున పూర్తి సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. శానిటైజేషన్ చేయాలని, అవసరమైన చోట్ల రసాయనాలు పిచికారీ చేయాలని ఆదేశించారు. అలాగే వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకునేలా అప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట్ల శిబిరాలు ఏర్పాటు చేసి, సేవలందించాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా బాధితులను మాట్లాడారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.