byసూర్య | Thu, Oct 15, 2020, 03:04 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు జలమండలి ఉన్నతాధికారులతో కలిసి అల్వాల్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. ప్రజలకు మంచి నీటి సమస్య లేకుండా నీటి సరఫరా ఇవ్వాలని, ఈ రిజర్వాయర్ నుండి వచ్చే నీటిని ఎలాంటి అంతరాయం లేకుండా రోజు విడిచి రోజు ప్రజలకు అందించేలా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈడి సత్యనారాయణ గారు, సిజిఎం అనిల్ కుమార్ గారు, జీఎం శ్రీధర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.