byసూర్య | Thu, Oct 15, 2020, 02:34 PM
మహబూబ్నగర్ : తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు అందజేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తీరొక్క డిజైన్లతో ఆడబిడ్డలు మెచ్చేలా ప్రభుత్వం చీరెలను చేయించిందన్నారు. గురువారం మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని బండ్లగేరిలో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పద్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.