byసూర్య | Mon, Oct 12, 2020, 10:24 AM
తెలంగాణలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొరసాగుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలో కొత్తగా 1021 మందికి కరోనా సోకింది. అదే సమయంలో ఆరుగురు కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2లక్షల 13వేల 084కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 1228కి పెరిగింది.