ఎంసెట్‌ మొదటి దశ కౌన్సెలింగ్‌ గడువు పొడిగింపు

byసూర్య | Mon, Oct 12, 2020, 11:27 AM

ఎంసెట్‌ మొదటి దశ కౌన్సెలింగ్‌ గడువును పొడిగించినట్లు ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. తొలి విడత ప్రక్రియ ఈ నెల 28న ముగుస్తుందన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు, స్లాంట్‌ బుకింగ్‌ ఈ నెల 19 వరకు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సోమవారం నుంచి ఈ నెల 20వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తామని చెప్పారు. వెబ్‌ ఆప్షన్లు 22 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. 22న సాయంత్రం ఆప్షన్లను ఫ్రీజ్‌ చేస్తామని, ఈ నెల 24న సీట్లను కేటాయిస్తామని తెలిపారు. ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ఈ నెల 24 నుంచి 28 వరకు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆదివారం నాటికి 35,124 మంది విద్యార్థులు స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్నారని తెలిపారు.


Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM