byసూర్య | Sun, Oct 11, 2020, 06:39 PM
ఆడ బిడ్డల పండుగకు ఆడపడుచులకు కానుకగా బతుకమ్మ చీరలు ఇస్తున్నారన్నారని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సమైక్య పాలనలో అప్పటి ప్రభుత్వాలు బతుకమ్మ పండుగ ను పట్టించుకునేవారు కాదు అన్నారు. ఆదివారం చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,ఎంపీలు బండ ప్రకాష్,పసునూరి దయాకర్,మేయర్ గుండా ప్రకాష్ రావు లతో కలిసి వడ్డేపల్లి పార్క్ లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల కవిత గారు బతుకమ్మ పండుగ నిర్వహించి ఆడబిడ్డల పండుగ కు ప్రపంచ ఖ్యాతి తీసుకువచ్చారు అన్నారు.స్వరాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసిఆర్ ప్రభుత్వం అన్ని తెలంగాణ పండుగలకు సముచిత స్థానం కల్పించారనా అన్నారు.మన రాష్ట్రంలో బోనాల పండుగ,బతుకమ్మ పండుగ కు అత్యంత ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్,మేయర్ గుండా ప్రకాష్ రావు తదితరులు హాజరయారు.