byసూర్య | Sun, Oct 11, 2020, 07:04 PM
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ను కేసులు వేసి అడ్డుకున్నారని మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో 108 ఉద్యోగుల సభలో ఈటల పాల్గొన్నారు. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నామని, 108, 104, ఈఎస్ఐ ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీలో వైద్యం కోసం వెళ్తే బెడ్లు ఖాళీ లేవు అంటున్నారని, డబ్బులు రావడం లేదంటున్నారని, ఇకపై ఆ సమస్య ఉండదని ఈటల రాజేందర్ చెప్పారు.