byసూర్య | Sun, Oct 11, 2020, 05:44 PM
జూబ్లీహిల్స్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్లి డివైడర్ను ఢీకొట్టి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏసు అనే వాచ్మెన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.