ఫ్లాష్..ఫ్లాష్.. సంగారెడ్డి లో 6 కరోనా పాజిటివ్ కేసులు..!

byసూర్య | Thu, Apr 02, 2020, 03:25 PM

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు మరిన్ని పెరుగుతున్నాయి. సంగారెడ్డిలో కొత్తగా ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయంపై సమాచారం అందుకున్న తెలంగాణ మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి హుటాహుటిన సంగారెడ్డికి వెళ్లారు. అక్కడకు చేరుకున్న వెంటనే సంగారెడ్డి కలెక్టర్‌తో హరీశ్‌ రావు సమీక్ష నిర్వహించారు.


కరోనా పాజిటివ్‌ వచ్చిన ఆరుగురిని వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ ఆరుగురి కుటుంబాల సభ్యులను అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు. వారు ఎవరెవరిని కలిశారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 100 దాటిన విషయం తెలిసిందే. వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొత్త కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.


Latest News
 

మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా Sat, Apr 27, 2024, 09:30 PM
మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం Sat, Apr 27, 2024, 09:22 PM
బంగారంలా మెరిసిపోతున్న స్మితా సబర్వాల్.. మేడం సర్ మేడం అంతే Sat, Apr 27, 2024, 09:20 PM
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ Sat, Apr 27, 2024, 09:04 PM