నగరంలో రేషన్ షాపులకు జనం క్యూ..

byసూర్య | Thu, Apr 02, 2020, 04:16 PM

నగరంలోని రేషన్ షాపుల దగ్గర జనం క్యూ కడుతున్న విషయం తెలిసిందే. రేషన్ సరుకుల కోసం జనం పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొంతమంది సరైన అవగాహన లేకుండానే అక్కడికి చేరుకుంటున్నారు. ఇది మిగిలిన వారికి ఇబ్బందికరం కావడంతో.. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీల నాయకులు మాస్కులు పంపిణీ, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎల్బీ నగర్‌లోని ఓ రేషన్ షాపు దగ్గర.. స్థానిక కాంగ్రెస్ నాయకులు మాస్కులు పంపిణీ చేశారు. అంతేకాకుండా వారికి కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. రేషన్ షాప్ డీలర్‌తో చర్చించిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పన్యాల జైపాల్ రెడ్డి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. 


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM