byసూర్య | Wed, Apr 01, 2020, 03:10 PM
ఫిబ్రవరి 28న ఢిల్లీ నుంచి బయల్దేరి పలు ప్రాంతాల్లో తిరుగుతూ మర్చి 24 న 37 మంది హైదరాబాద్ చేరుకున్నారు. 37 మందిలో 13 మంది ఢిల్లీ వాసులు, 24 మంది హైదరాబాద్ వాసులు ఉన్నారు. ఢిల్లీ నిజాముద్దీన్ లో తబ్లిగ్ జమాత్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. మౌలానా సాద్ సహా ఐదుగురిపై అంటువ్యాధుల చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మర్కజ్ కు హాజరైన 12 మంది విదేశీయుల సమాచారాన్ని దాచిపెట్టినందుకు జామా, వజీరాబాద్, మసీదుల ఇమాంలపై కేసు నమోదు చేశారు.