byసూర్య | Wed, Apr 01, 2020, 03:17 PM
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ డివిజన్ లో కార్పొరేటర్ వి శ్రీనివాస్ రెడ్డి అధ్వారంలో ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, నేపాల్ రాష్ట్రానికి చెందిన నిరుపేదలకు 12 కిలోల రేషన్ బియ్యం ను అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ కూడా ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ రోజు 500 మందికి రేషన్ పంపిణీ చేశామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు, రెవిన్యూ అధికారులతో పాటు టీఆర్ఎస్ డివిజన్ నాయకులు రేశం మల్లేష్, రఘు, సంపూర్ణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.