byసూర్య | Tue, Mar 31, 2020, 08:51 AM
తెలంగాణలో ఆరుగురు మృతి చెందారు. మార్చి 13-15 మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకిందని సీఎం ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఏంటంటే "మార్చ్ 13-15 మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి #Coronavirus సోకింది. వారిలో తెలంగాణకు చెందిన ఆరుగురు మరణించారు. గాంధి ఆసుపత్రిలో ఇద్దరు, అపోలో ఆసుపత్రి, గ్లోబల్ ఆసుపత్రి, నిజామాబాద్, గద్వాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు" దీనిపై స్పెషల్ టీమ్స్ ని పెట్టి వారందరిని టెస్ట్ చేయాలని ఆదేశాలిచ్చారు.