byసూర్య | Sun, Mar 29, 2020, 02:05 PM
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీసులు ప్రజల కొరకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. కాబట్టి ఉప్పలోని రామంతాపూర్ లో ఈ రోజు టీవీ స్టూడియో పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర ఉప్పల్ మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ముత్యాల సందరయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో పోలీసులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గంధం నాగేశ్వరరావు, బైగాళ్ల జంగయ్య, ముత్యాల విజయ్, వేముల చిన్నా, బోరుగడ్డ రత్నం, ముత్యాల రేనా సాయి తదితరులు పాల్గొన్నారు.