byసూర్య | Sun, Mar 29, 2020, 01:51 PM
మంత్రి ఈటల రాజేందర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే విదేశాలకు వెళ్లి వచ్చిన వాళ్లను సర్వే చేస్తున్న జిల్లా యంత్రాంగం దాని పై కలెక్టర్ లను అడిగి పూర్తి సమాచారం సేకరించారు. కొత్తగా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వాళ్లపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు, డిఎహెచ్ఓ లకు మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. లక్షణాలున్న ఏ ఒక్కరిని వదులొద్దని అందరిని పరీక్షించాలని మంత్రి ఈటెల అధికారులను ఆదేశించారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వాళ్ల వివరాలు సేకరించి ప్రస్తుతం వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని సూచించారు.