byసూర్య | Sun, Mar 29, 2020, 11:55 AM
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని మక్తవెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలో కాళికాదేవి ఆలయం దగ్గర గ్రామానికి చెందిన ఓ రైతు లేగదూడ పై చిరుత దాడి చేసి చంపేసింది. గతంలో కూడా అనంతసాగర్ గండి చెరువు రాంపూర్ కుసుమసముద్రం గ్రామాలలో చిరుత దాడిలో అనేక మంది రైతుల పశువుల పై దాడి చేసి చంపేసిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి రైతుల పశువుల పై దాడి చేస్తున్న చిరుతను బంధించాలని వేడుకుంటున్నారు. గతంలో ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.