byసూర్య | Sun, Mar 29, 2020, 11:53 AM
కరోనా వైరస్ భయంతో హ్యాండ్ శానిటైజర్లకు భారీగా పెరిగిన డిమాండ్ ను క్యాష్ చేసుకోవడానికి ఓ ముఠా రంగంలోకి దిగింది. ఎలాంటి అనుమతులు, ప్రమాణాలు లేకుండా వీటిని తయారు చేస్తూ మూడు బ్రాండ్ల పెరితో నకిలీ శానిటైజర్లను మెడికల్ షాపులకు విక్రయిస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం దాడి చేసి ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. సాధారణంగా శానిటైజర్ చేతికి రాసుకున్న వెంటనే ఆవిరిఅవుతుందని.. వీరు తయారు చేసిన నకిలివి అలా కావని అదనపు డీసీపీ చక్రవర్తి పేర్కొన్నారు. మొఘల్ పురకు చెందిన అబ్దుల్ వాజిద్ ఓ హోమియోపతి సంస్థలో వర్కింగ్ పార్ట్నర్ గా ఉన్నాడు. తన విధుల్లో భాగంగా కొన్ని రకాలైన రుగ్మతలకు అవసరమైన మందుల్ని ఇతడు తయారు చేసి అందించేవాడు. వీటిని షకీలుద్దీన్ అనే మెడికల్ రిప్రజెంటేటివ్ తో పాటు అజర్ హుస్సేన్, మమ్మద్ అబ్దుల్ వాసిలు ఖరీదు చేసి పాత బస్తీలో మెడికల్ షాపులకు విక్రయిస్తున్నారు. వీరిలో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు.