byసూర్య | Sun, Mar 29, 2020, 11:43 AM
లాక్ డౌన్ పై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ లు ఎస్పీలు, పోలీస్ కమిషనర్ లు, ఆరోగ్య శాఖ అధికారులు, అగ్రికల్చర్, సివిల్ సప్లై, మార్కుఫెడ్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటున్న చర్యలు, రోజురోజుకు పెరుగుతున్న కేసులు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. రైతులు పండించే ధాన్యం మార్కెట్లోకి వచ్చే సమయం కాబట్టీ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష చేయనున్నారు.