కేంద్ర బలగాల సాయం కోరలేదన్న డీజీపీ

byసూర్య | Sat, Mar 28, 2020, 12:44 PM

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ పెట్టిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడానికి తెలంగాణ సర్కార్ ఆర్మీ సహాయం కోరిందని వార్తలు వస్తున్నాయి. శుక్రవారం కేంద్ర బలగాలు తెలంగాణకు చేరుకున్నాయంటూ వీడియో వైరల్ అయ్యింది. అయితే దీని పై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర బలగాలు వస్తున్నాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. రాష్ట్రానికి కేంద్ర బలగాలు కావాలని కోరలేదని ఆ అవసరం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.


Latest News
 

శ్రీనివాసనగర్ గ్రామాన్ని సందర్శించిన కేంద్ర ఉద్యోగులు Tue, May 21, 2024, 07:23 PM
అనుమానంతో భార్యను చంపిన భర్త Tue, May 21, 2024, 07:21 PM
ఔషధ శాఖ అధికారుల సోదాలు Tue, May 21, 2024, 07:19 PM
మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు Tue, May 21, 2024, 04:09 PM
స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్ Tue, May 21, 2024, 03:52 PM