![]() |
![]() |
byసూర్య | Tue, May 21, 2024, 03:52 PM
పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్ గాంధీ పాల్ టెక్నిక్ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లను ఆయన సందర్శించారు. మూడంచల భద్రత వ్యవస్థను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిసి కెమెరా పని తీరును పరిశీలించారు.