![]() |
![]() |
byసూర్య | Tue, May 21, 2024, 07:19 PM
నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అజ్మాపురంలో ఆర్ఎంపీగా చలామణి అవుతూ లైసెన్స్ లేకుండా మందులు విక్రయిస్తున్న సైదిరెడ్డి క్లినిక్ లో సోమవారం ఔషధశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో రూ. 71వేల విలువైన 42 రకాల ఔషధాలను, అనుమతి లేకుండా విక్రయిస్తున్న 31 రకాల ఔషధాలు, రెండు రకాల కాలం చెల్లిన మందులు, తొమ్మిది రకాల ఫిజీషియన్ శాంపిల్స్ సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.