byసూర్య | Tue, Jan 14, 2020, 12:36 PM
వనపర్తి జిల్లా మర్రికుంటలో విషాదం చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ను కారు ఢీకొన్నది. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. వాహనాలు తనిఖీ చేస్తూ కారును హెడ్ కానిస్టేబుల్ ఆపారు. హెడ్ కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి దుండగులు పరారైయ్యారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ సలీమ్ ఖాన్ శ్రీరంగపూర్ పీఎస్ లో పనిచేస్తున్నాడు.