byసూర్య | Tue, Jan 14, 2020, 01:06 PM
బీజేపీ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో పతంగుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ఫంగన్ సింగ్ కులస్తే, బీజేపీ నేత లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఫంగన్ సింగ్ కులస్తే మాట్లాడుతూ పౌరసత్వ చట్టంపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. పౌరసత్వ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు అని అన్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ... భైంసా లాంటి ఘటనలు దుర్మార్గం అని అన్నారు. కాంగ్రెస్ ఎంఐఎం కలిసి దేశ విభజనకు కుట్రలు చేస్తున్నాయి అని అన్నారు.