భైంసాలో బీభత్సం...

byసూర్య | Mon, Jan 13, 2020, 03:43 PM

ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో బీభత్సం కారణంగా పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తుల దాడిలో దాదాపు 18 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి.జనవరి 12న పట్టణంలోని ఒక ప్రాంతంలో ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన యువకుడు ద్విచక్రవాహనంపై వీధుల్లో విచక్షణారహితంగా హంగామా చేస్తుండటంతో స్థానిక యువకులు మందలించారు. ఇదే అదనుగా, ఘర్షణలే లక్ష్యంగా దాదాపు 400-500 మంది హిందువుల ఇళ్లపై ప్రణాళిక బద్దంగా దాడి చేసినట్టు స్థానికుల ద్వారా తెలిసింది.హిందూ జనాభా తక్కువగా ఉన్న కొర్బా వీధిలో 18 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. వీటిలో స్థానిక హిందు వాహిని కార్యకర్త ఇంటిని అల్లరి మూకలు లక్ష్యంగా చేసుకున్నాయి.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపైనా రాళ్ళ దాడికి పాల్పడ్డారు. ఫైర్ ఇంజన్ వాహనాల పైపులను కోయడంతో పాటు స్థానిక ఇండ్లను సైతం లూటీ చేశారుదాడిలో పాల్గొన్నవారు స్థానికులతో పాటు, సమీపంలోని నిర్మల్ పట్టణానికి చెందిన వారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా ఒక ప్రవేట్ కార్యక్రమానికి వచ్చిన వారుగా స్థానికులు తెలిపారు.ఘర్షణలు అదుపు చేసే క్రమంలో 8 మంది పోలీసులకు తీవ్ర గాయపడినవారిలో డిఎస్పీ కూడా ఉన్నట్టు సమాచారం.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM