byసూర్య | Sun, Jan 12, 2020, 07:41 PM
హైదరాబాద్ నాగోల్లో అర్ధరాత్రి మందుబాబులు వీరంగం సృష్టించారు. బిర్యానీ కావాలంటూ.. ఓ హోటల్ యజమానిపై దాడికి దిగి.. అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఓ హోటల్లో బిర్యానీ కావాలని అడగ్గా... వారు లేదని సమాధానం చెప్పడంతో సిబ్బందితో గొడవకు దిగారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ యాజమానిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.