byసూర్య | Sun, Jan 12, 2020, 07:18 PM
తాము పెంచుకుంటున్న విదేశీజాతి శునకాన్ని ఎవరో అపహరించారంటూ దాని యజమాని హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఎల్లారెడ్డిగూడలోని జయప్రకాశ్ నగర్కు చెందిన సాయికృష్ణ రెండేళ్ల నుంచి విదేశీ జాతికి చెందిన పమేరియన్ స్కూబీ రకం కుక్కను పెంచుకుంటున్నాడు. దానిని కుటుంబ సభ్యులతో సమానంగా ఎంతోప్రేమతో పెంచుకుంటున్నాడు. మూడురోజుల క్రితం ఇంటి ముందు ఆడుకుంటున్న స్కూబీని ఎవరో ఎత్తుకెళ్లారు. చుట్టుపక్కల ఎంతవెతికినా ప్రయోజనం లేదు. త్వరగా తమ స్కూబీని వెతికి పెట్టాలని సాయికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న స్కూబీ కనిపించడం లేదన్న దిగులుతో సాయి వాళ్ల నాన్న ఆస్పత్రి పాలయ్యాడని వాపోయాడు. బ్లూ క్రాస్ సంస్థ నిర్వాహకులను కలిసి తన గోడు వినిపించాడు. ఎలాగైనా తన స్కూబీని వెతికి పెట్టాలని వేడుకున్నాడు.