byసూర్య | Sun, Jan 12, 2020, 05:42 PM
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మాయమాటలతో మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేస్తున్నారంటూ టీఆర్ఎస్ పై టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎప్పుడైనా మునిసిపాలిటీల్లో తనిఖీలు చేశారా? డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏమయ్యాయి? ఏ మునిసిపాలిటీలో అయినా మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజాకోర్టు నిర్వహించేందుకు కేటీఆర్ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.