byసూర్య | Sun, Jan 12, 2020, 12:21 PM
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు నేడు ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోన్ జనరల్ మేనేజర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 5 గంటల 50 యాభై నిమిషాలకు బయలుదేరే ఈ ప్రత్యేక రైలు రేపు ఉదయం (సోమవారం ఉదయం) 8 గంటల 50 యాభై నిమిషాలకు శ్రీకాకుళం చేరుకుంటుందని ఆయన వివరించారు. సోమవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి ప్రయాణం అయ్యే ఈ రైలు మంగళవారము నాడు ఉదయం7 ఏడు గంటల 40 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు రాకపోకలు సాగించే ఈ ప్రత్యేక రైలు వరంగల్ , ఖమ్మం, రాయపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం నార్త్, కొత్తవలస, విజయనగరం ,చీపురుపల్లి స్టేషన్ లలో ఒక్క నిమిషం పాటు నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.