byసూర్య | Sun, Jan 12, 2020, 12:41 PM
రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. శనివారం అత్యల్పంగా ఆదిలాబాద్లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. జగిత్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీలు, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో 11 డిగ్రీలు ములుగు, వరంగల్, యాదాద్రి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 13డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గాలిలో తేమ శాతం తగ్గడంతోనే ఈ పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పారు.