byసూర్య | Mon, Oct 14, 2019, 02:58 PM
తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల ఉద్యోగాలు తొలగించింది ప్రభుత్వమా.. ప్రతిపక్షాలా అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎవరు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తామని గతంలో కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. నష్టాన్ని పూడ్చటానికి ఆర్టీసీ ఆస్తులు అమ్ముతానడం ఎక్కడి న్యాయయమని ప్రశ్నించారు.