byసూర్య | Mon, Oct 14, 2019, 03:47 PM
హైదరాబాద్ : ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యానికి ఓ బాలిక బలైంది. కాచిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని సుందర్ నగర్లో ఉంటున్న ఫాతిమా(11)కు జ్వరం వచ్చింది. దీంతో ఆదివారం రాత్రి షిఫా క్లినిక్ కు ఫాతిమాను ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లారు. వైద్యం చేసిన డాక్టర్ షమీ ఆమెకు మెడిసిన్స్ ఇచ్చాడు. ఆ మెడిసిన్స్ వేసుకున్న కాసేపటికి అవి వికటించి బాలిక మృతి చెందింది. డాక్లర్ నిర్లక్ష్యం వల్లే తమ అమ్మాయి మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.