ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

byసూర్య | Mon, Oct 14, 2019, 02:56 PM

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మాహుతి చేసుకొని చనిపోవడంతో... ప్రభుత్వ తీరుకు నిరసనగా.. ఆర్టీసీ జేఏసీ ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. రాజకీయ పార్టీల నేతలు ఆర్టీసీ బంద్‌కు మద్దతు ప్రకటించారు. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క ఆందోళనల్లో పాల్గొన్నారు.


బంద్ ప్రభావంతో ఖమ్మం నగరంతోపాటు.. కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి పట్టణాల్లో దుకాణాలు తెరుచుకోలేదు. బంద్ ప్రభావంతో రెండు జిల్లాల్లోని 670కు పైగా బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. బస్సులు తిరగకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ప్రైవేట్ వాహదారులు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు.శ్రీనివాసరెడ్డి అంత్యక్రియలు ఆదివారం రాత్రి ఖమ్మంలో నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి ఖమ్మం తరలించారు. ఖమ్మం జిల్లా సరిహద్దు నుంచి శ్రీనివాసరెడ్డి నివాసానికి భౌతిక కాయం చేరుకునే వరకూ.. అడుగడుగునా పోలీసులు పహారా కాశారు. వైన్ షాపులు, పెట్రోల్ బంకులను కూడా మూసివేశారు.


 


 


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM