byసూర్య | Fri, Oct 11, 2019, 08:12 PM
భాగ్యనగరంలో భారీ వర్షం కొనసాగుతూనే ఉంది. 10రోజులు నుంచి కురుస్తున్న కుంభ వృష్టి.. శుక్రవారం కూడా దంచికొట్టింది. దీంతో రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. నేరెడ్ మెట్ లో ఇళ్లలోకి నీరు చేరగా, ఎల్బీనగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో చింతల్ కుంట చెక్ పోస్టు వరకు వాహనాలు నిలిచిపోయాయి. సాయంత్రం ఆఫీస్ ల నుంచి ఇంటికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమీర్ పేట, బేగంపేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఉప్పల్, కుషాయిగూడ, తార్నాక, హబ్సీగూడలో భారీ వర్షం కురిసింది.