byసూర్య | Fri, Oct 11, 2019, 05:57 PM
ఆర్టీసీ కార్మీకులకు మద్దతుగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్రంలోని అన్ని డిపోల ముందు కార్మీకులకు మద్దతుగా ఆందోళన చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈనేపథ్యంలోనే ఆర్టీసీ క్రాస్రోడ్లోని బస్భవన్ వద్ద చేపట్టనున్న ధర్నా కార్యక్రమంలో లక్ష్మన్ పాల్గోనున్నట్టు చెప్పారు. సమ్మె విషయంలో నియతృత్వంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ పార్టీ మెడలు వంచడం ఒక్క బీజేపీకే సాధ్యం అవుతుందని అన్నారు.
ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వారిని నిర్భంధంలోకి తీసుకుని, భయాందోళనలకు గురి చేస్తుందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కూడ కొనసాగుతున్నాయని అన్నారు. అప్పటి ఉద్యమ స్పూర్తికి ఇప్పటికి టీఆర్ఎస్లో మార్పులు వచ్చాయని ఆయన ఫైర్ అయ్యారు. ప్రజల బలిదానాలన్ని కూడ నిర్వీర్యం అవుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ కబంధ హస్తాల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించేందుకు బీజేపీ నాంది పలుకుతుందని చెప్పారు.