20వతేదీన అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

byసూర్య | Sun, Aug 18, 2019, 08:26 PM


ఈనెల 20వతేదీన అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ప్రగతిభవన్ లో మంగళవారం నాడు కలెక్టర్లతో సీఎం భేటీ కానున్నారు. కలెక్టర్లతో సమావేశానికి సీఎం మంత్రులను కూడా ఆహ్వానించారు.  కొత్త రెవెన్యూ చట్టం నిర్ణయం నేపథ్యంలో సీఎం కలెక్టర్లతో చర్చించనున్నారు. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో కలెక్టర్ల అభిప్రాయాలను సీఎం తీసుకోనున్నారు. క్షేత్రస్థాయిలో భూపరిపాలనలో ప్రత్యక్ష సంబంధం ఉండే కలెక్టర్లతో సీఎం సమీక్షించనున్నారు. అవినీతికి ఆస్కారం లేని, రైతులకు ఇబ్బంది కలగని రీతిలో చట్టం రూపకల్పనపై చర్చలు జరగనున్నాయి. చట్టంలో ఎలాంటి నిబంధనలు ఉండాలనే అంశంపై విస్తృతంగా చర్చించనున్నారు.  


Latest News
 

రైతులందరికీ అలర్ట్.. మీ ఫోన్‌కు పీఎం కిసాన్, రైతుబంధు మెస్సేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త Wed, May 08, 2024, 10:15 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Wed, May 08, 2024, 09:14 PM
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. గోడకూలి ఏడుగురు మృతి Wed, May 08, 2024, 09:09 PM
ఓటేసేందుకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ Wed, May 08, 2024, 09:04 PM
ఆడపిల్ల పుడితే రూ.2 వేల డిపాజిట్‌.. ఈ దంపతులది ఎంత గొప్ప మనసు Wed, May 08, 2024, 08:59 PM