byసూర్య | Sun, Aug 18, 2019, 12:21 AM
తెలంగాణాలో నదులను అనుసంధానం చేయడం వలన . తెలంగాణ కంటే.. ఆంధ్రకే ఎక్కువ ప్రయోజనమని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా, గోదావరి అనుసంధానం తో కేసీఆర్రాయలసీమని రత్నాల సీమ చేస్తామని చెప్పడం సరికాదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలే కారణమన్నారు. ఈ రోజుకి తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలకి నీళ్ల పంపిణీకి సంబంధించిన ప్రణాళికలు లేవని, ఏపీ కి నీళ్లు ఇస్తామంటూ కేసీర్ తెలంగాణకు అన్యాయం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే తమపార్టీ నదుల అనుసంధానంపై నిపుణులతో చర్చించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతాల నుండి నీళ్లు అందించవచ్చని తెలిసినా అనుసంధానం పేరుతొ ప్రజలని మోసం చేసుతున్న కెసిఆర్ ఆంధ్రాకి నీళ్లు పారించాలని చూడటం సహేతుకం కాదన్నారు , పెండింగ్ ప్రాజెక్ట్లపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయనడిమాండ్ చేశారు.