byసూర్య | Sun, Aug 18, 2019, 01:02 AM
టీఆర్ఎస్ నుంచి బిగ్ షాట్ మాజీ ఎంపీ, కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరనున్నారని వార్తలొస్తున్నాయి. వారం పది రోజులుగా అయన టీఆర్ఎస్ అధిష్టానానికి ఫోన్ లో కూడా టచ్ లో లేకుండా పోవడంతో పటు. బీజేపీ నేతలతో ప్రేత్యేకంగా సమావేశమైనట్టు ఆయన కీలక అనుచరులలోనే వినవస్తున్న మాట, వైసీపీ ఎంపీ గా ఎన్నికై తెరాస లో చేరిన పొంగులేటి గతకొంత కాలంగా పార్టీ అధిష్టానం తనపై వ్యవహరిస్తున్న మనస్తాపంతో ఉన్నారని సమాచారం. గత అసెంలై ఎన్నికలలో పొంగులేటి కి బలమైన అనుచర వర్గం ఉం డటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం పది అసెంబ్లీ స్థానాలలో దాదాపుగా సగానికి పైగా స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేశారు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ (ఇండిపెండెంట్) గెలుపు వెనుక, ఆ తరువాత టీఆర్ఎస్ లోకి ఆయన ఎంట్రీ వెనుక పొంగులేటి హస్తం ఉందన్నది అయన వర్గీయుల మాట. మధిరలో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్కకు గట్టి పోటీనిచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్కు ఖమ్మం జడ్పీ చైర్మన్ కట్టబెట్టడం వెనుక కూడా పొంగులేటి హస్తం ఉంది. ఐతే ఇంట చేసినా కనీసం తనకు పార్టీ ప్రాధాన్యత ఇవ్వ టం లేదని వాపోతూ, అసంతృప్తితో ఉన్న పొంగులేటి కి బీజేపీ ఆపరేషన్ కమలం పనిచేసిందని. త్వరలో అయన అమిటీష సమక్షంలో పార్టీలో చేరే ఆస్కారం ఉందని వినిపిస్తోంది.