మానస సరోవరంలో చిక్కుకున్న 40 మంది యాత్రికులు

byసూర్య | Mon, Jun 24, 2019, 04:15 PM

నేపాల్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలకు చెందిన 40 మంది యాత్రికులు మానస సరోవరంలో చిక్కుకున్నారు. చైనా - నేపాల్‌ సరిహద్దుల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీన రెండు రాష్ర్టాల నుంచి యాత్రికులు మానస సరోవర యాత్రకు బయలుదేరారు. ఐదు రోజుల నుంచి వారు అక్కడ ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. యాత్రికులు ఈ రోజు తాము ఇబ్బంది పడుతున్న విషయాన్ని వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపించారు. తమను రక్షించాలంటూ వీడియోలో కోరారు. యాత్రికుల అవస్థలను వారిని తీసుకెళ్లిన ట్రావెల్స్‌ సంస్థ పట్టించుకోవడం లేదని వాపోయారు.


Latest News
 

లవర్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా యువకుడు, ఏం జరిగింది? Tue, Apr 30, 2024, 09:05 PM
హైదరాబాద్‌లో లేడీ డాన్,,,గుట్టు చప్పుడు కాకుండా గేమింగ్ Tue, Apr 30, 2024, 08:10 PM
అన్నదాతకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన Tue, Apr 30, 2024, 08:05 PM
5 వేల పింఛన్, 5 లక్షల ఆర్థిక సాయం.. తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! Tue, Apr 30, 2024, 08:01 PM
వియ్యంకుడి కోసం రంగంలోకి విక్టరీ వెంకటేశ్.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం Tue, Apr 30, 2024, 07:41 PM