byసూర్య | Sun, Jun 23, 2019, 12:51 PM
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై అధిష్టానం ఆరాలు తీస్తుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గత వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ఉండగా అధిష్టానం భట్టితో తెలంగాణ పార్టీ పరిస్థితిపై సమీక్షలు చేస్తుంది. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారుతున్నారని అధిష్టానం ప్రశ్నించినట్లు తెలుస్తుండగా నూతన పీసీసీ, పార్టీ విధేయులు ఎవరనే దానిపై అధిష్టానం భట్టితో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది.