byసూర్య | Sun, Jun 23, 2019, 02:18 PM
యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, శీఘ్రదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు భక్తులకు లఘు దర్శనం ఏర్పాట్లు చేశారు. రద్దీ కారణంగా కొండపైకి వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు.