byసూర్య | Sun, Jun 23, 2019, 02:25 PM
వరంగల్ అర్బన్: హన్మకొండలో కామాంధుడి చేతిలో బలైన చిన్నారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీతో వినయ్ భాస్కర్ ఫోన్లో మాట్లాడించారు. హత్యకు గురైన 9 నెలల చిన్నారి శ్రీహిత తల్లిదండ్రులతో మహమూద్ అలీ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబసభ్యులకు మంత్రి తెలిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా శ్రీహిత తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.