శ్రీహిత కుటుంబానికి అండగా ఉంటాం: కేటీఆర్‌

byసూర్య | Sun, Jun 23, 2019, 02:25 PM

వరంగల్‌ అర్బన్‌: హన్మకొండలో కామాంధుడి చేతిలో బలైన చిన్నారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌, ఎంపీ పసునూరి దయాకర్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌ అలీతో వినయ్‌ భాస్కర్‌ ఫోన్లో మాట్లాడించారు. హత్యకు గురైన 9 నెలల చిన్నారి శ్రీహిత తల్లిదండ్రులతో మహమూద్‌ అలీ ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబసభ్యులకు మంత్రి తెలిపారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా శ్రీహిత తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు.


Latest News
 

హనుమాన్ విగ్రహానికి పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు Tue, Apr 23, 2024, 04:22 PM
నల్గొండలో కుటుంబ పాలన నడుస్తుంది: శానంపూడి సైదిరెడ్డి Tue, Apr 23, 2024, 04:19 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్ Tue, Apr 23, 2024, 03:37 PM
24న మోటార్ సైకిల్ల వేలం పాట Tue, Apr 23, 2024, 03:14 PM
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM