byసూర్య | Fri, Jun 21, 2019, 03:39 PM
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో నడిరోడ్డుపై యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు యువకుడిని వెంబడించి కత్తులతో నరికి చంపారు. మృతుడిని వేములవాడకు చెందిన రవి(30)గా గుర్తించారు. హత్యకు గల కారణం తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.