byసూర్య | Fri, Jun 21, 2019, 05:02 PM
కరీంనగర్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నేడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టులో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పంప్హౌజ్లను రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం లక్ష్మపూర్ గ్రామ సమీపంలో 8వ పంప్హౌజ్ను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, సుంకే రవిశంకర్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోలివాడ పంప్హౌజ్ను మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ ప్రారంభించారు. అన్నారం బ్యారేజిని మంత్రి నిరంజన్రెడ్డి, నందిమేడారం వద్ద ఆరో ప్యాకేజి పంపుహౌజ్ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.