byసూర్య | Fri, Jun 21, 2019, 05:09 PM
తెలంగాణ రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. రెండు నుంచి మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరిస్తాయని అధికారులు చెప్పారు. రుతు పవనాల ప్రభావంతో పలు చోట్ల వర్షం మొదలైంది. నగరంలోని హైటెక్ సిటీ, హయత్నగర్, ఎల్బీనగర్, లక్డీకాపూల్, చార్మినార్, మొఘల్ పురా, అబిడ్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.