byసూర్య | Thu, Jun 20, 2019, 02:45 PM
కస్టమర్లకు కెనరా బ్యాంక్ షాక్ ఇచ్చింది. ఇకపై ఖాతాదారులు నెలకు 3 సార్లు మాత్రమే రూ.50 వేల వరకూ డిపాజిట్ చేసుకోవాలంటూ షరతు పెట్టింది. నెలకు 3 సార్లు డిపాజిట్ చేసినా, రూ.50 ల పరిమితి దాటినా సర్వీస్ ఛార్జ్ చెల్లించక తప్పదు. వెయ్యికి ఒక రూపాయి చొప్పున వసూలు చేయనున్నట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. జిఎస్టి కూడా అదనంగా వసూలు చేస్తారు. ఈ ఛార్జీలు జూలై 1 నుండి అమలులోకి రానున్నాయి.