byసూర్య | Thu, Jun 20, 2019, 11:10 AM
హర్యానా : హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలోని మందావర్ గ్రామంలో విద్యుత్ షాక్తో చిరుత మృతి చెందింది. చిరుత మృతిపై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిరుత చెట్టుపైకి ఎక్కిన క్రమంలో ప్రమాదవశాత్తు దానికి కరెంట్ తీగలు తగలడంతో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు నిర్ధారించారు.