byసూర్య | Thu, Jun 20, 2019, 09:21 AM
నిజామాబాద్లో సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను బీజేపీ అభ్యర్థి అర్వింద్ ఓడించడం వెనుక పికే వ్యూహాలున్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఎపి అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి విజయం లో కీలక పాత్ర పోషించిన పికేను తెలంగాణ లో టిఆర్ఎస్ గెలుపు కోసం పని చేయాలని కేటీఆర్ కూడాకలిసారట. అయితే డీల్ కుదరక పోవటంతో పాటు జెడియుకు మిత్ర పక్షమైన బిజెపి కి సహకరించాలంటూ వచ్చిన వత్తిళ్లకు ఆయన తలొగ్గినట్టు తెలుస్తోంది. ప్రధానంగా కేసీఆర్ కుటుంబ గణం పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరించిన పికే నిజామాబాద్ నుండి పోటీ చేసిన కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి కోసం ప్రత్యేకంగా టీం వర్క్ చేసినట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ టీం రెండు నెలల పాటు అనధికారికంగా నిజామాబాద్ లో బిజెపి అభ్యర్థి అరవింద్ గెలుపు కోసం పని చేసింద, అందువల్లే కవిత ఓటమి ఖాయమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.