పాతబస్తీలో హై టెన్షన్‌! రాజాసింగ్‌కు గాయాలు..

byసూర్య | Thu, Jun 20, 2019, 11:16 AM

హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకుంది... జుమ్మెరాత్ బజార్‌లో రాత్రి సమయంలో స్వాతంత్ర్య సమరయోధురాలు, రాణి అవంతి బాయ్ లోథ్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఓ వర్గం ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విగ్రహ ప్రతిష్టాపనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకు దిగారు స్థానిక యువకులు. ఆందోళనకారులకు మద్దతుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అనుమతి లేకుండా విగ్రహాన్ని పెట్టడం కుదరదంటూ పోలీసులు అడ్డునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లురువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురితో పాటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తలకు గాయాలయ్యాయి. వీరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM