byసూర్య | Wed, Jun 19, 2019, 10:45 PM
యావత్ సమాజం తలదించుకునే విధంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఓ ఉన్మాది తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం చేసి . ఆపై చిన్నారిని హత్య చేసిన సంఘటన బుధవారం జరిగింది. వివరాలలోకి వెళితే ...హన్మకొండ బుద్దభవన్ ప్రాంతానికి చెందిన జక్కోజు రచన జగన్ దంపతుల కుమార్తె తొమ్మిది నెలల చిన్నారి శ్రిత . ఎండాకాలం కావడంతో బిల్డింగ్ పై పడుకున్న సమయంలో చిన్నారిని ఎత్తుక వెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన పరకాల మండలం మాదరం చెందిన కోలేపాక ప్రవీణ్ .. చిన్నారి శ్రిత ఏడుపును గమనించిన తల్లిదండ్రులు పాపకోసం వెతుకగా నిందితుడు పాపను వదిలి పారిపోయాడు . వెంటనే చిన్నారిని హన్మకొండ లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ చికిత్సా కోసం తరలించారు .ఆసుపత్రికి వెళ్లిన చిన్నారి తల్లిదండ్రులకు అప్పటికే చిన్నారి మృతి చెందిదని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి మరణించిన చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం తరలించి మార్చురీ కీ తరలించారు. కాగా జగన్ హైదరాబాద్ లో ఓ ప్రయివేట్ కళాశాల పని చేస్తున్నాడని సమాచారం. చిన్నారిని హత్య చేసి పారిపోయిన నిందితుడిని హనుమకొండ పోలీసుల అదుపులోకి తీసుకున్న తెలియవచ్చింది.