byసూర్య | Wed, Jun 19, 2019, 10:20 PM
లారి కింద పడి ఓబాలిక దుర్మరణం పాలైన ఘటన హైదరాబాద్ సమీపంలోని షాద్ నగర్ - పరిగి రోడ్డులో ఘోరం జరిగింది. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలిక లారీ కింద పడి నుజ్జునుజ్జు అయ్యి అందరి కంట కన్నీరు పెట్టించింది. వివరాలలోకి వెళితే... ప్యారడైజ్ కాలనీలో నివాసముంటున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సలీం కూతురు ఆడుకోవటానికి ఇంటి బైటకు వచ్చి, పరిగి రోడ్డులోని సిఎస్కేవెంచర్ కు వెళ్లే రహదారిని దాటే ప్రయత్నం చేస్తూ, వేగంగా వస్తున్న లారీ కింద పడింది, ఘటన విషయాలు తెలియగానే షాద్ నగర్ పోలీసులు క్షణాలలో ఆ స్ధలానికి చేరుకుని శవాన్ని పోస్టు మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు.